Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ బంగారు తెలంగాణను గంగలో కలిపేసిండు: ఈటల రాజేందర్

కేసీఆర్ బంగారు తెలంగాణను గంగలో కలిపేసిండు: ఈటల రాజేందర్
, శనివారం, 12 జూన్ 2021 (18:05 IST)
రాజీనామా చేసి రాజకీయాలు చేస్తా అంటూ చెప్పారు ఈటెల రాజేందర్. ఇంకా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఎప్పుడు ఉపఎన్నికల వచ్చినా కోట్లు కుమ్మరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. 
 
హుజురాబాద్ ఎన్నిక కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసం కాదు. కాలకేయులకి యుద్ధం. హుజురాబాద్‌లో ఎన్నికల కోసం రాజీనామా చేస్తున్నా. కెసీర్ మీ రైతాంగం పైన కనికరం లేదు. మంత్రులతో మాట్లాడే పొజిషన్ లేదు.
 
నాయకులు, కార్యకర్తలు మెడలు వంచడానికి సిద్ధం. అక్రమ కేసులకి భయపడే ప్రసక్తే లేదు.
బంగారు తెలంగాణాను గంగలో కలిపిన ఘనత కెసీర్ కుటుంబానికి దక్కింది. కెసీఆర్‌ది చక్రవర్తుల పాలన. 
 
ప్రజాస్వామ్య పాలన లేనే లేదు. హుజురాబాద్‌లో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా. నాకు అంతకంటే ఏమి కావాలి. కానీ కేసీఆర్ అహంకారం అంతం అవ్వాలి. కుల మత రాజకీయాలు మా దగ్గరికి కూడా చేరనివ్వను. అమరులకు నివాళి అర్పిస్తున్నా అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రుటిలో తప్పిన ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ దంపతులు