Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల పర్యటన కోసం హస్తిన కోసం సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు హస్తిన బాటపట్టారు. ఆయన మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం మరోమారు ఢిల్లీకి వెళుతున్నారు. 
 
శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. కేంద్రమంత్రులతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం.
 
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్‌ చర్చిస్తారు. 
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించే ముఖ్యమంత్రుల సమీక్షకు కేసీఆర్ హాజరవుతారు.
 
అనంతరం పీయూష్ గోయల్‌తోనూ సమావేశమవుతారు. ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 9 రోజులపాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత రెండు వారాలకే మళ్లీ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments