Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల పర్యటన కోసం హస్తిన కోసం సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు హస్తిన బాటపట్టారు. ఆయన మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం మరోమారు ఢిల్లీకి వెళుతున్నారు. 
 
శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. కేంద్రమంత్రులతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం.
 
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్‌ చర్చిస్తారు. 
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించే ముఖ్యమంత్రుల సమీక్షకు కేసీఆర్ హాజరవుతారు.
 
అనంతరం పీయూష్ గోయల్‌తోనూ సమావేశమవుతారు. ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 9 రోజులపాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత రెండు వారాలకే మళ్లీ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments