Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో..?

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:41 IST)
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. 33 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుతో సహా 33 శాతం మహిళా
రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సభ ముందుకు తీసుకురావాలన్నారు. 
 
శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. 
 
ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లు ఈ రెండు బిల్లుల ప్రవేశానికి బీఆర్‌ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుదీర్ఘంగా చర్చించింది.
 
మహిళల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ హక్కులను ఎప్పటికప్పుడు కేంద్రానికి వినిపిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
 
ఈ దిశగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యసభ, లోక్‌సభలో ఎంపీలు పార్టీ డిమాండ్లను లేవనెత్తాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments