మంత్రులు ఎమ్మెల్యేలపై మళ్లీ కేసీఆర్ ఫైర్

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (17:54 IST)
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. మున్సిపల్‌ టికెట్ల కేటాయింపులో.. పాత, కొత్త నేతల మధ్య వివాదాలకు కేసీఆర్ చెక్‌ పెట్టనున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
 
మున్సిపాలిటీల వారిగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్‌ ముందుంచారు. కొన్ని నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జ్‌గా నియమించారు.సమావేశం తర్వాత బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ అందించనున్నారు.
 
మంత్రులు ఎమ్మెల్యేల పై కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల అంశంపై చర్చించేందుకు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని భావించిన సీఎం కేసీఆర్... ఇందుకు సంబంధించి ముందుగానే వారికి సమాచారం అందించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకోవాలని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం నేడు ఉదయం ఆలస్యంగా సమావేశానికి రావడం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగించాయి. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సమావేశానికి ఆలస్యంగా రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలా ఎందుకు జరిగిందని వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకే తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్... అప్పటికీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడంపై ఆరా తీశారు. ఇక ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.... సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

తర్వాతి కథనం
Show comments