Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (15:15 IST)
భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం ఉదయం బయలుదేరారు. ఆయన వెంట 600 కార్లు బయలుదేరగా, భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా, సోలాపూర్‌ జిల్లాలో  భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్రలోని ధారిశివ్ జిల్లాలోని ఒమర్గాకు వీరంతా చేరుకుంటారు. అక్కడ భోజనం చేసిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు సోలాపూర్‌కు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురంకు చేరుకుని అక్కడి విఠోభార్ముణికి మందిర్‌లో కేసీఆర్, ఇత్ర నేతలు ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఆ తర్వాత సోలాపూర్‌ జి్ల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలోనే ప్రముఖ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరుతారు. ఆ తర్వాత ధారాశివ్ జిల్లాలో కొలువైన తుల్జాభవనీ అమ్మవారి శక్తిపఠంను సందర్శించుకుని హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణమవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments