జనగామలో కేసీఆర్ టూర్-తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా.. అంటూ..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ప్రధాని మోదీ పార్లమెంటులో విభజనపై మాట్లాడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మోదీపై టీఆర్ఎస్ నేతలు మండిపడటం, వారికి బీజేపీ కౌంటర్ ఇస్తుండటంతో జనగామ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. 
 
ఇక ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. 
 
అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
 
అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామ పట్టణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలతో నింపేశారు.
 
కేసీఆర్ సభ జరిగే మైదానంలో "తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా" అనే క్యాప్షన్‌తో ఏర్పాటుచేసిన భారీ బెలూన్ ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సభకు సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

VD 14: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వీడీ 14 సినిమా ఉంటుంది - రాహుల్ సంకృత్యన్

Anil Ravipudi: చిరంజీవి తో మరో సినిమా - రాజమౌళితో కంపారిజన్ లేదు : అనిల్ రావిపూడి

Yamini ER: ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments