Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామలో కేసీఆర్ టూర్-తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా.. అంటూ..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ప్రధాని మోదీ పార్లమెంటులో విభజనపై మాట్లాడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మోదీపై టీఆర్ఎస్ నేతలు మండిపడటం, వారికి బీజేపీ కౌంటర్ ఇస్తుండటంతో జనగామ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. 
 
ఇక ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. 
 
అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
 
అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామ పట్టణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలతో నింపేశారు.
 
కేసీఆర్ సభ జరిగే మైదానంలో "తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా" అనే క్యాప్షన్‌తో ఏర్పాటుచేసిన భారీ బెలూన్ ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సభకు సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments