Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామలో కేసీఆర్ టూర్-తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా.. అంటూ..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ప్రధాని మోదీ పార్లమెంటులో విభజనపై మాట్లాడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మోదీపై టీఆర్ఎస్ నేతలు మండిపడటం, వారికి బీజేపీ కౌంటర్ ఇస్తుండటంతో జనగామ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. 
 
ఇక ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. 
 
అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
 
అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామ పట్టణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలతో నింపేశారు.
 
కేసీఆర్ సభ జరిగే మైదానంలో "తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా" అనే క్యాప్షన్‌తో ఏర్పాటుచేసిన భారీ బెలూన్ ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సభకు సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments