Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ గారూ మీరు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి: తమ్మినేని వీరభద్రం

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:18 IST)
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఉపేక్షించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలకు సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 
కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమిస్తే ఆయనకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి సమకూర్చాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని చెబుతుండటం దారుణమని ఆయన తెలిపారు.
 
జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్లు నష్టపోయిందని ఆయన వివరించారు. ఎల్ఆర్ఎస్ నుండి సామాన్యులను మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments