Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇక జూనియర్ కళాశాలలుగా కస్తూర్బా విద్యాలయాలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:46 IST)
తెలంగాణలోని కొన్ని  కస్తూర్బా విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 36 కస్తూర్బా విద్యాలయాలల్లో ఈ సంవత్సరం నుంచే ఇంటర్ మీడియేట్ తరగతులను ప్రారంభించాలని ఆదేశించింది.

ఈ కళాశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన జరుగుతుంది. 2021 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 2022 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

బూర్గుం పహాడ్, పలిమెల, మహాముత్తారం, మొగుళ్లపల్లి, రేగొండ, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, మహేశ్వరం, కొందుర్గు, సిద్దిపేట అర్బన్, సిర్పూర్ -టీ, మాణిక్యాపూర్, గండీడ్, మహమ్మదాబాద్ లోని కస్తూర్బా విద్యాలయాల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

భద్రాచలం, టేకుమట్ల, బీబీపేట, ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, చింతల మానేపల్లి, కెరెమెరి, రెబ్బెన, సిర్పూర్- యూ, జైపూర్, గంగారం, రఘునాధ పాలెం, నర్సాపూర్ -జీ,  సిరిసిల్ల, అంతర్గాం, పెంట్లపల్లి, శెట్టిపాలెం, మద్దిరాల, కృష్ణ, ఐనవోలు,  భీంపూర్, అమరచింత,  అడ్డగూడూర్‌లోని కస్తూర్బా విద్యాలయాల్లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు ప్రారంభం అవుతాయి. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉంటాయిని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments