విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కట్టుబడి వున్నాం: జనసేన

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:36 IST)
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం పాదయాత్రలు చేయడం, ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌లో నాయకులను కలవడం వంటివి చేస్తున్నాయే గానీ, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మనస్ఫూర్తిగా కృషి చేయడం లేదని ఎద్దేవా చేశారు.

అక్కడ మాట్లాడిన మాటలు వేరు ఇక్కడి ప్రజలకు చెప్పే మాటలు వేరని పేర్కొన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే వారందరికీ అన్యాయం జరుగుతుందని, భావితరాలకు భవిష్యత్తు ఉండదని తెలిపారు.

అందువల్ల దీనిపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించే విధంగా స్థానిక నాయకులందరూ కలిసి పోరాడాలన్నారు. వచ్చే నెలలో పవన్‌ కల్యాణ్‌ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, ఏ విధంగా ముందుకెళ్లాలో అక్కడ కార్మిక నాయకులతో చర్చించనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మాటలు వినే స్థితిలో లేదని, తన అనుభవంలో ఇటువంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments