Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రైతు మృతి-వడ్ల కుప్పపైనే నేలకూలిపోయాడు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:48 IST)
తెలంగాణలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. వడ్ల కుప్పపై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవలే జిల్లాలోని లింగంపేట మండలం ఐలాపూర్​కు చెందిన రైతు బీరయ్య వడ్ల కుప్పపైనే చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా రోజుల తరబడి ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నలు గుండెపగిలి వడ్ల కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర విషాదం నింపుతున్నాయి
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య(55)  పది రోజుల క్రితం తన వడ్లను స్థానిక కొనుగోలు సెంటర్​కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడే కావలి ఉంటున్నారు. 
 
గురువారం సాయంత్రం రాజయ్య కుప్ప వద్ద కావలి ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పి వస్తున్నదని, చెమటలు పడుతున్నయని మిగతా రైతులకు చెప్పాడు. వాళ్లు వెంటనే కామారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు రాజయ్య అప్పటికే గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments