Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను ఎందుకు బహిష్కారంటే...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:00 IST)
KK
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. తెరాస కొత్త నాటకానికి దారితీసిందని, మంగళవారం పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించబోతున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. ఆయన మాటలను నిజం చేస్తూ తెరాస సభ్యులు ఇపుడు పార్లమెంట్ సమావేశాలను రద్దు చేశారు. 
 
దీనిపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని గత ఏడు రోజులుగా డిమాండ్ చేస్తూ, నిరసనలు తెలుపుతున్నామని, కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతుందన్నారు. 
 
బాయిల్డ్ రైస్ కొంటారో లేదే కేంద్రం స్పష్టత ఇవ్వాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సభలో నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే తమ పార్టీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments