Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను ఎందుకు బహిష్కారంటే...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:00 IST)
KK
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. తెరాస కొత్త నాటకానికి దారితీసిందని, మంగళవారం పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించబోతున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. ఆయన మాటలను నిజం చేస్తూ తెరాస సభ్యులు ఇపుడు పార్లమెంట్ సమావేశాలను రద్దు చేశారు. 
 
దీనిపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని గత ఏడు రోజులుగా డిమాండ్ చేస్తూ, నిరసనలు తెలుపుతున్నామని, కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతుందన్నారు. 
 
బాయిల్డ్ రైస్ కొంటారో లేదే కేంద్రం స్పష్టత ఇవ్వాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సభలో నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే తమ పార్టీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments