Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటు వేయించుకుని ముఖం చేస్తున్నారు .. అందుకే బైపోల్‌ను బహిష్కరిస్తున్నాం...

ఓటు వేయించుకుని ముఖం చేస్తున్నారు .. అందుకే బైపోల్‌ను బహిష్కరిస్తున్నాం...
, ఆదివారం, 3 అక్టోబరు 2021 (16:28 IST)
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగనుంది. ఇందులో అధికార వైకాపాతో పాటు.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నాయి. జనసేన పార్టీ ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ఈ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. తమ గ్రామంలో ఓట్లు వేయమని స్పష్టంచేశారు. 
 
గత 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఏ నాయకుడు తమ గ్రామం వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులను మా గ్రామంలోకి అనుమతించమని హెచ్చరించారు. గ్రామ పొలిమేరలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు పెట్టారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో పెళ్లి కోసం 9 నెలల బాబును అమ్మేసింది..