Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో కార్పొరేటర్ కుమారుడే సూత్రధారి!

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (07:37 IST)
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ వద్ద ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు సాదుద్దీన్ మాలిక్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 
 
గత నెల 28వ తేదీన అమ్నీషియా పబ్‌కు తన స్నేహితులతో కలిసి వెళ్లిన కార్పొరేటర్‌ కుమారుడు అక్కడ బాధిత బాలికను మాటల్లో పెట్టి తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. గతంలో ఒకసారి కలిశావంటూ మాటలు కలిపాడు. ఇంటి వద్ద దించుతానంటూ నమ్మించి కారులో ఎక్కించుకున్నాడు. 
 
బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లిన తర్వాత బాలిక బ్యాగు, కళ్లద్దాలు, సెల్‌ఫోన్‌ బలవంతంగా లాక్కొన్నాడు. ఆ తర్వాత ఆ బాలికను కారులో కూర్చోబెట్టి నిందితులంతా బేకరీలో తమకు కావాల్సిన చిరుతిండ్లు ఆరగించారు. సిగరెట్ తాగారు. 
 
ఆ తర్వాత తమతో కారులో వస్తేనే ఆయా వస్తువులు ఇస్తామంటూ ఆ బాలికను బెదిరించి ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లారు. నిర్జన ప్రదేశంలో వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం