Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూఛ్... అలా అనలేదు.. సీఎం కేసీఆర్, ఉద్యోగుల కృషి వల్లే కరోనా మాయం.. శ్రీనివాస రావు

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (15:47 IST)
Srinivasa Rao
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పల్టీకొట్టారు. బుధవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని.. కరోనా వైరస్ మహమ్మారి నుంచి భారత్‌‍ను ఏసు ప్రభువు రక్షించారనీ, ఆయన దయ, కృప వల్లే ఈ వైరస్ నుంచి విముక్తి పొందినట్టు వ్యాఖ్యానించారు.

పైగా, మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని అన్నారు. మనం చేసిన సేవలు వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే కరోనా తగ్గిందని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఆయన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆరోపించారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశఆరు. దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవు, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments