Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో నాకు చుక్కలు చూపించారు... ప్రజలు మద్దతిస్తే కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తా: జగ్గారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలను పాలించాలని కేసీఆర్‌కు అధికారం

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలను పాలించాలని కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే...  ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
 
ఏ తప్పు చేయని తనపై ప్రభుత్వం సుమోటోగా కేసు పెట్టిందని వాపోయారు. 2004 కేసులో తన పేరు లేదని గుర్తు చేశారు.. తప్పు చేశానా.. లేదా అని కోర్టు తేలుస్తుందన్నారు. రాహుల్ సభ తర్వాత తనను ప్రభుత్వం టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీపై కూడా తప్పుడు కేసులు పెడితే అది మంచి సంప్రదాయం అవుతుందా అని ప్రశ్నించారు.
 
13 రోజులు తనకు జైల్లో చుక్కలు చూపెట్టారని వాపోయారు. పోలీసులు కూడా పక్షపాతం వహించకుండా న్యాయబద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఏ విషమైనా ఎంతో ధైర్యంగా మాట్లాడే వాడినని అటువంటిది నన్ను భయభ్రాంతులకు గురిచేశారని వాపోయారు. ప్రజలు ఆదరించి ఆశీస్సులు ఇస్తే కేసీఆర్‌కి చుక్కలు చూపిస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments