Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ - ఐటీ సోదాలు

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:59 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వేకువజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు ఆరంభమయ్యాయి. ఖమ్మంలోని ఆయన నివాసంలో 3 గంటల నుంచి సోదాలు ప్రారంభించిన ఈడీ, ఐటీ అధికారులు మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చి, ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగడం కలకలం రేపుతుంది. 
 
కాగా, బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగొచ్చని ముందుగానే పసిగట్టారు. ఆ విధంగానే అధికారులు గురువారం వేకువజాము నుంచి సోదాలకు రావడం గమనార్హం. కాగా, తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటూ అనేక ముందస్తు సర్వేలు ఢంకాబజాయించి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐడీ అధికారులు సోదాలకు దిగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments