Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి జగదీష్ రెడ్డి పీఏ నివాసంలో ఐటీ సోదాలు.. రూ.4 లక్షలు స్వాధీనం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:41 IST)
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నల్గొండ తిరుమలనగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి నివాసంలో 30 మంది సభ్యులతో కూడిన బృందం సోదాలు నిర్వహించి రూ.4 లక్షలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
ఆయన కారును కూడా అధికారులు సీజ్ చేశారు. అలాగే, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రి జగదీశ్ రెడ్డి కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 
స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
 
కాగా, ఈ నెల 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఐటీ అధికారులు మంత్రి జగదీష్, ఆయన పీఏ నివాసాల్లో సోదాలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments