Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి జగదీష్ రెడ్డి పీఏ నివాసంలో ఐటీ సోదాలు.. రూ.4 లక్షలు స్వాధీనం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:41 IST)
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నల్గొండ తిరుమలనగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి నివాసంలో 30 మంది సభ్యులతో కూడిన బృందం సోదాలు నిర్వహించి రూ.4 లక్షలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
ఆయన కారును కూడా అధికారులు సీజ్ చేశారు. అలాగే, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రి జగదీశ్ రెడ్డి కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 
స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
 
కాగా, ఈ నెల 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఐటీ అధికారులు మంత్రి జగదీష్, ఆయన పీఏ నివాసాల్లో సోదాలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments