Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా

Webdunia
మంగళవారం, 30 మే 2023 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ వసూలు లీజ్‌కు సంబంధించి ఐఆర్‌బీ సంస్థ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఈ పరువు నష్టం దావా నోటీసులను పంపించింది. 
 
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌(ఓఆర్‌ఆర్‌) రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి టోల్‌ వసూలు కాంట్రాక్ట్‌ టెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్‌ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఓఆర్‌ఆర్‌ టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్‌, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ ఒప్పందంలో అవకతవకలు, అవినీతి జరిగిదంటూ రఘునందన్ రావు ఆరోపణలు చేయడంతో ఆగ్రహించిన ఐఆర్‌బీ సంస్థ ఈ నోటీసులను పంపించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments