Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని ప్రాణం తీసిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:59 IST)
తెలంగాణాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఫలితాల్లో కేవలం 49 శాతంమంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలపై పైచేయిగా నిలిచింది. 
 
అయితే, ఈ ఫలితాలను చూసిన తర్వాత అనేక మంది విద్యార్థులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఏం రాసినా పాస్ చేస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు.. అనేక మంది విద్యార్థులను ఫెయిల్ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. 
 
ఓ విద్యార్థి అయితే, ఏకంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లను ట్యాగ్‌ చేస్తూ ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆ విద్యార్థి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 
 
ఇదిలావుంటే నల్గొండ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ నగర్‌ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థినికి ఇంటర్‌లో తక్కువగా మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments