Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాస్ చేస్తానని చెప్పి అందర్నీ ఫెయిల్ చేశారు.. నా మృతికి మీరే కారణం

పాస్ చేస్తానని చెప్పి అందర్నీ ఫెయిల్ చేశారు.. నా మృతికి మీరే కారణం
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో కేవలం 50 శాతం లోపు విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. కరోనా వైరస్ కారణంగా ఈ పరీక్షలను తొలుత రద్దు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఆలస్యంగా నిర్వహించి, గురువారం ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
అయితే, ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకోనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రటించాడు. దీనికి కారణం ఆ ఇద్దరు మంత్రులేనంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ వెల్లడించాడు. 
 
తాను నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానిని, ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇపుడు అందర్నీ ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. 
 
దీంతో క్షణాల్లో ఆ విద్యార్థిని చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి, విద్యార్థి ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇంతలోనే ఆ విద్యార్థి తాను క్షేమంగా ఉన్నానని ఓ ట్వీట్ చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిజోరంలో భూకంపం : చంపైకి 56 కిమీ దూరంలో...