Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య, 3 పేజీల సూసైడ్ లేఖ

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (12:21 IST)
పోకిరీల వేధింపులు భరించలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. హైదరాబాదు లోని జీడిమెట్లలో ఉంటున్న విద్యార్థిని తన ఆత్మహత్యకు పోకిరీల వేధింపులే కారణమంటూ మూడు పేజీల సూసైడ్ లేఖ రాసింది. తాను కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో పోకిరిగా బెడద ఎక్కువగా ఉంటుందని, వీళ్ళని నిలువరించలేక పోతున్నామని, పోకిరిల నుంచి మమ్మల్ని కాపాడాలని పేర్కొంది. 
 
తన లేఖలో నాకు అమ్మ, నాన్న లేరు. ప్రేమించిన వాడు ఆప్యాయంగా మాట్లాడటంలేదు. కనీసం నా కోసం కొంత సమయాన్ని కేటాయించడంలేదు. కాలేజీకి వస్తుంటే బస్తీలో పోకిరీలు వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి.. నేను ఎంత ప్రేమించినా నన్ను నన్నుగా ప్రేమించే వారు ఎవరూ లేరు. 
 
ఇక నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అంటూ మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటర్మీడియేట్‌ విద్యార్థిని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 
సూరారం డివిజన్‌ నెహ్రూ నగర్‌కు చెందిన తులసి(17)కి చిన్నతనంలోనే ఆమె తండ్రి లక్ష్మణ్, తల్లి సుశీల మృతి చెందారు. దీంతో అప్పటినుంచి ఆమె అమ్మమ్మ కోమలిబాయి వద్ద ఉంటూ చింతల్‌లోని బాగ్యరథి కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments