Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో తెలుగు టెక్కీ అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం ఇంజంగారి గూడెంవాసి. ఉద్యోగం కోసం ఆర్నెళ్ల క్రితం ఆస్ట్

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (08:57 IST)
ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం ఇంజంగారి గూడెంవాసి. ఉద్యోగం కోసం ఆర్నెళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డి.. సిడ్నీలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఈయన ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మరణించారు. 
 
ఆదివారం సాయంత్రం తన భార్య శిరీష‌తో మాట్లాడారు. మరుసటిరోజు భార్య ఫోన్ చేయగా, ఆదినారాయణ రెడ్డి లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియాలోని ఆయన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి, రూంకు వెళ్లి చూడాలని కోరారు. దీంతో ఆదినారాయణ రూంకు వెళ్లి చూడగా, ఆయన విగతజీవిగా పడివున్నారు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు చేరవేశారు. 
 
భర్త మరణవార్త వినగానే శిరీష కుప్పకూలిపోయింది. శిరీష - ఆదినారాయణకు మూడేళ్ల కవల పిల్లలున్నారు. ఆదినారాయణ రెడ్డి‌ మృతిపై ఆసీస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తన భర్త మృతి కేసులో అనుమానం ఉందనీ, దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని భార్య శిరీష కోరుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments