Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికూతుళ్లతో అక్రమసంబంధం.. బెదిరించడంతో ఇద్దరినీ..?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:14 IST)
కలియుగంలో వున్నామనేందుకు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా తల్లీకూతుళ్లు ఒకే వ్యక్తిని అక్రమ సంబంధం నెరపారు. తల్లీ, కూతురు కలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకున్నారు.  అదే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
వడియారం అటవీ ప్రాంతంలో ఇద్దరు తల్లీ, కూతుర్ల శవాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కాగా వీరిద్దరూ మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన యాదమ్మ, ఆమె కూతురు సంతోష అని తేలింది. దీంతో యాదమ్మ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. విచారణను మరింత వేగం పెంచగా.. వడియారం గ్రామానికి చెందిన నగేశ్‌ను అనుమానించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 
 
తల్లీ, కూతుర్లకు నగేశ్‌తో కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. అయితే వారిద్దరూ వావి వరసలు మరిచి నగేశ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
 
లేదంటే తమపై అత్యాచారం చేశావని కేసులు పెడతామని బెదిరించారు. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తూ వచ్చిన నగేశ్‌.. కొద్ది కాలం తర్వాత వారి వేధింపులు తట్టుకోలేక వారిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
 
ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన వారిని వడియారం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఫుల్లుగా వారికి మద్యం తాగించాడు. వారు మత్తులోకి జారుకున్న తర్వాత గొంతునులిమి హత్య చేశాడని తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments