Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు.. వారానికోసారి బిస్కెట్లు తెచ్చి..?

crime scene
, సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:29 IST)
కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు. ఇంట్లో పెట్టి తాళాలు వేసి బిస్కెట్లు ఆకలికి విసిరేసి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (62)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్‌ చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌. చిన్న కుమారుడు వెంకటేశన్‌ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పదేళ్ల కిందటే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె మృతి చెందారు. ఆస్తుల కోసం అన్నాదమ్ములు విడిపోయారు. ఇందులో భాగంగా తల్లిని పట్టించుకోలేదు. పదేళ్ల క్రితం ఓ ఇంట్లో బంధించారు. 
 
వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులే ఆహారం పెట్టేవారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఆమెను కాపాడటం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మానసికస్థితి సరిగా లేదు. చికిత్స కోసం తంజావూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగసుందరన్‌, వెంకటేశన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశువుల పాకలో సేదతీరుతున్న కొడాలి నాని