Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాగైతే చాలామంది పార్టీ వీడడం ఖాయం.. వి.హనుమంతరావు

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (20:16 IST)
నిర్మొహమాటంగా మాట్లాడ్డంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు పెట్టింది పేరు. ఎవరేమనుకున్నా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. అలాంటి నేత తాజాగా తన పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నియమించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాచేస్తే అనేకమంది పార్టీని వీడిపోతారని ఆ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు  స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు.

పార్టీలో ఆయారాం, గయరాం వంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. . కాంగ్రెస్‌లో ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్‌లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్‌ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో అపరిశుభ్ర వాతావరణంతో రోగాలు ప్రబలుతున్నాయని, భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల పరిస్థితిని చూడాలని అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments