Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన హ్యుందామ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:12 IST)
హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సీఎస్‌ఆర్‌ విభాగం హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) నేడు నిమిషానికి 50 లీటర్ల (ఎల్‌పీఎం) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించింది.
 
ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ శ్రీ ఉపేంద్ర జాదవ్‌ తో పాటుగా హెచ్‌ఎంఐఎల్‌ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా ఆసుపత్రిలోని దాదాపు 50 ఐసీయు పడకల ఆక్సిజన్‌ అవసరాలు తీరనున్నాయి. అంతేకాదు, దాదాపు ఒక లక్ష మంది రోగులకు సైతం ఇది  సహాయపడనుంది. కోవిడ్‌ –19 రోగులతో పాటుగా ఇతర సంబంధిత వైద్య సమస్యలు కలిగిన  రోగులకు ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడం ద్వారా తగిన చికిత్స నందించేందుకు ఈ మెడికల్‌ ఆక్సిజన్‌ తోడ్పడుతుంది.
 
ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం సందర్భంగా శ్రీ ఎస్‌ఎస్‌ కిమ్‌, ఎండీ అండ్‌ సీఈవొ- హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత మహమ్మారి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొవాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. మా అంతర్జాతీయ లక్ష్యం ‘మానవత్వం కోసం అభివృద్ధి’ ద్వారా, ఆరోగ్య మౌలికవసతులను బలోపేతం చేయడం కోసం వైద్య సిబ్బంది మరియు కమ్యూనిటీకి మద్దతునందిస్తున్నాం.


తీవ్ర అనారోగ్యం బారిన రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్‌ను నిరంతరం సరఫరా చేయడం అవసరం. అందువల్ల మేము ఈ సదుపాయాన్ని ఆసుపత్రిలో ఏర్పాటుచేయడం ద్వారా భవిష్యత్‌ డిమాండ్‌ను సైతం తీర్చనున్నాం’’అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments