Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింకులు పంపారు.. క్లిక్ చేయగానే.. ఖాతాలోని డబ్బును ఊడ్చేశారు...

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:03 IST)
సైబర్ నేరగాళ్లు సరికొత్త టెక్నిక్స్‌తో బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు. దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. మీరు గిఫ్ట్ ఓచర్లు గెలుచుకున్నారంటూ కొన్ని లింకులు పంపించారు. ఇది నిజమేనని నమ్మి క్లిక్ చేసిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 74 వేల రూపాయలను ఊడ్చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆ మహిళ లబోదిబో మంటోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ కవాడిగూడకు చెందిన ప్రియాంక అనే మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. మీరు కొన్ని బహుమతులు గెలుచుకున్నట్టు నమ్మించారు. వీటిని తీసుకోవాలంటే ఈ ఫారాలు నింపాలని, జీఎస్టీ, అమేజాన్‌ చార్జీలు చెల్లించాలంటూ చెప్పడంతో ఆమె నిజమని నమ్మింది. 
 
ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా కొన్ని లింకులు పంపించారు. ఆమె ఆ లింకులను క్లిక్‌ చేస్తూ అందులో వివరాలు నింపుతూ వెళ్లింది. అందులో బ్యాంకుకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సైబర్‌నేరగాళ్లు ఆమె ఖాతాలో నుంచి రూ.74 వేలు మాయం చేశారు. ఆ తర్వాత మొబైల్ నంబరుకు రూ.74 వేలు విత్‌డ్రా చేసినట్టు సందేశం రావడంతో అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ... లబోదిబో మంటోంది. 
 
అలాగే, మరో మహిళా ఉద్యోగిని కూడా ఇదే విధంగా మోసపోయింది. బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదు తెలుసుకోడానికి బ్యాంకు నుంచి గిఫ్ట్‌ హోచర్లు పంపిస్తున్నామంటూ కొన్ని లింకులు పంపించారు. అది నిజమని నమ్మిన ప్రైవేట్‌ ఉద్యోగిని రజని ఆ లింకులు ఓపెన్‌ చేసింది. దీంతో ఆమె ఖాతాలలో నుంచి రూ.80 వేలు కాజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments