Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురికి జీవదానం చేసిన వివాహిత... ఎలా?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:47 IST)
ఓ వివాహిత నలుగురి ప్రాణదానం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ వివాహిత అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో నలుగురు ప్రాణదానం పొందారు. మృతురాలి పేరు గండ్ర హరిత (26). తాను చనిపోతూ నలుగురికి పునర్జన్మ ఇచ్చింది. 
 
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గండ్ర హరిత భర్తతో కలిసి హైదరాబాద్ నగరంలో తన భర్తతో కలిసి ఉంటున్నారు. ఈమె భర్త యశ్వంత్ రెడ్డి హైదరాబాద్ నగరలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు పది నెలలో చిన్నారి కూడా ఉంది. 
 
ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి తలనొప్పింగా ఉందని చెప్పి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. 
 
జీవన్ దాన్ ప్రతినిధులు హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో హరిత కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు, నేత్రాలు సేకరించిన వైద్యులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో నలుగురికి అమర్చారు. దీంతో హరిత చనిపోయినప్పటికీ.. ఆ నలుగురి రూపంలో ఆమె బతికే ఉంటుందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments