Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిళకు ఊరట కలిగించిన తెలంగాణ హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (14:16 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న షరతు విధించింది. అలాగే రెండు ష్యూరిటీలు, రూ.30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 
 
కాగా, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సోమవారం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేసమయంలో ఆమె బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారమే వాదనలు పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం మంగళవారం వెలువరించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
అయితే, పోలీసులపై షర్మళ చేయి చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పేర్కొన్నారు. షర్మిళ తరపు న్యాయవాదులు వాదిస్తూ ఆమెను పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతిస్పందించారని చెప్పారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments