Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిళకు ఊరట కలిగించిన తెలంగాణ హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (14:16 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న షరతు విధించింది. అలాగే రెండు ష్యూరిటీలు, రూ.30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 
 
కాగా, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సోమవారం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేసమయంలో ఆమె బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారమే వాదనలు పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం మంగళవారం వెలువరించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
అయితే, పోలీసులపై షర్మళ చేయి చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పేర్కొన్నారు. షర్మిళ తరపు న్యాయవాదులు వాదిస్తూ ఆమెను పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతిస్పందించారని చెప్పారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments