Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిళకు ఊరట కలిగించిన తెలంగాణ హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (14:16 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న షరతు విధించింది. అలాగే రెండు ష్యూరిటీలు, రూ.30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 
 
కాగా, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సోమవారం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేసమయంలో ఆమె బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారమే వాదనలు పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం మంగళవారం వెలువరించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
అయితే, పోలీసులపై షర్మళ చేయి చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పేర్కొన్నారు. షర్మిళ తరపు న్యాయవాదులు వాదిస్తూ ఆమెను పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతిస్పందించారని చెప్పారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments