హైదరాబాద్‌లో టెక్కీ దారుణ హత్య.. సెల్లార్‌లో మాటువేసి కత్తులతో నరికేశారు...

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (09:16 IST)
హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ఆయన భార్య తరపు బంధువులకు సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ హత్య అమీర్‌పేట్‌లోని ధరమ్ కరణ్ రోడ్డు ఆ టెక్కీ ఉంటున్న అపార్టుమెంట్లోనే జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్ (25), మచిలీపట్టణానికి చెందిన లక్ష్మీగౌరి (22) భార్యాభర్తలు. గతేడాది ఫిబ్రవరి 23న వీరికి వివాహమైంది. 
 
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు ఆల్విన్ కాలినీలో భార్యతో కలిసి జీవిస్తుండగా, ఈ యేడాది జూన్ 1న లక్ష్మీగౌరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
భర్త, అత్తమామల వేధింపుల వల్లే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చాడు. 
 
దాంతో రాజు ప్రతి వారం బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండడంతో గత 40 రోజులుగా ధరమ్ కరణ్ రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లో నివసించే మేనమామ వద్ద ఉంటున్నాడు.
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు చికెన్ కోసం అపార్ట్‌మెంట్‌ నుంచి కిందికి వచ్చాడు. అక్కడి సెల్లార్‌లో అప్పటికే మాటువేసిన నలుగురు నిందితులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యవెనక చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీగౌరి బంధువుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments