Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఉద్యోగుల పేరుతో ఒంటరిగా యువతిపై అత్యాచారం...

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (13:03 IST)
ఇటీవలి కాలంలో తమ ఇళ్ళలో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగుల పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీఎస్‌ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23) ఇంట్లోనే ఉంటోంది. 
 
మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని, ఫైనాన్స్‌ ఇస్తామని యువతి ఉంటున్న ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా.. మరో వ్యక్తి యువతితో ఫైనాన్స్‌ గురించి మాటలు కలిపి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు యువతి బిగ్గరగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. 
 
ఈ ఘటనపై యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తెలిపారు. కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments