Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఉద్యోగుల పేరుతో ఒంటరిగా యువతిపై అత్యాచారం...

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (13:03 IST)
ఇటీవలి కాలంలో తమ ఇళ్ళలో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగుల పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీఎస్‌ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23) ఇంట్లోనే ఉంటోంది. 
 
మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని, ఫైనాన్స్‌ ఇస్తామని యువతి ఉంటున్న ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా.. మరో వ్యక్తి యువతితో ఫైనాన్స్‌ గురించి మాటలు కలిపి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు యువతి బిగ్గరగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. 
 
ఈ ఘటనపై యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తెలిపారు. కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments