Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ భారీవర్షం, వరదలు: 24 మంది మృతి

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (13:48 IST)
హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వర్షాలు భారీగా కురవడంతో నగరం పూర్తిగా జలమయంగా మారిపోయింది. నగరంలో ఇలాంటి భయానక పరిస్థితి సృష్టించిన వాయుగుండం హైదరాబాదును దాటింది. సుమారు 30 ఏళ్ల తర్వాత సరిగ్గా భాగ్యనగరం మీదుగా ప్రయాణించిన వాయుగుండం చివరికి కర్ణాటక చేరింది. దీంతో నగరవాసులు వాయుగుండం తాకిడి నుండి తప్పించుకున్నారు.
 
అయితే వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో భాగ్యనగరంలో ఇక వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం కర్ణాటక తాకినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పలుచోట్ల పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు.
 
కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం రాత్రి కూడా నగరంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నగరంలో మంగళవారం నుండి కురిసిన వర్షాలతో మహానగరం పూర్తిగా జలమయం అయింది. ఇప్పటికే నగరంలో కురిసిన వర్షాలకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ప్రవాహం ఉధృతం కావడంతో పలుచోట్ల జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments