Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫార్మా కంపెనీపై ఐటీ విభాగం దాడులు.. వామ్మో బీరువా నిండా కరెన్సీ కట్టలే!

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (13:32 IST)
currency
హైదరాబాద్ ఆధారిత అతిపెద్ద ఫార్మా కంపెనీపై ఐటీ విభాగం దాడులు నిర్వహించింది. రూ .142 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. భారీ పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా మేజర్ హెటిరో ఫార్మాస్యూటికల్‌పై దాడులు చేసిన అనంతరం.. ఆదాయపు పన్ను శాఖ రూ .550 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని గుర్తించింది. రూ .142 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. 
 
మూలాల ప్రకారం, అక్టోబర్ 6న ఈ దాడులు జరిగాయి. ఇందులో  గుర్తించబడని ఆదాయానికి రైడ్‌లో నగదును గుర్తించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
 
ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్‌ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఐటీ కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది.
 
ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్‌ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్‌ సెటిల్‌ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments