Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడిని లాకరు గదిలో ఉంచి తాళం వేసిన బ్యాంకు సిబ్బంది

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (17:14 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న యూనియన్ బ్యాంకు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా నడుచుకున్నారు. బ్యాంకుకు వచ్చిన 87 యేళ్ళ వృద్ధుడిని లాకరు గదిలో ఉంచి బ్యాంకుకు తాళం వేశారు. దీంతో ఆ వృద్ధుడు 18 గంటల పాటు బ్యాంకు లోపలిభాగంలోనే ఉండిపోయారు. మరుసటి రోజు బ్యాంకుకు వచ్చిన సిబ్బంది అతన్ని గమనించి  విస్తుపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, సోమవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు బ్యాంకుకు వెళ్లాడు. ఆయన బ్యాంకులోని లాకర్‌ గదిలో ఉన్న విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు.
 
దీంతో బ్యాంకు పని వేళులు ముగియడంతో దానికి తాళం వేసి వెళ్లిపోయారు. బ్యాంకు నుంచి బయటకు రాలేక కృష్ణారెడ్డి అందులోనే ఉండిపోయారు. ఆయన వద్ద సెల్ ఫోన్ కూడా లేదు. దీంతో చీకటిపడినప్పటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశఆరు. దీంతో పోలీసులు సీసీ టీవీ కెమెరాలు చూడగా కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్టు గుర్తించారు. 
 
మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు సిబ్బంది వచ్చిన తర్వాత లాకరు గది నుంచి బ్యాంకు వృద్ధుడిని పోలీసులు రక్షించారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్న వృద్ధుడిని తక్షణం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments