Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ దేవతలపై పోస్టులు.. ట్విట్టర్‌పై హైకోర్టు ఫైర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (17:06 IST)
కాళికా దేవి సహా ఇతరు హిందూ దేవతలపై అభ్యంతరకరమైన పోస్టులను పెట్టిన "ఎథిస్ట్‌రిపబ్లిక్" ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం.. ట్విట్టర్ చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.
 
అయితే, కోర్టు ఉత్తర్వుల్లేకుండా ఆ ఖాతాలను నిలిపివేసే అధికారం మాకు లేదని ట్విట్టర్ వివరించింది. ఈ వివరణపై హైకోర్టు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ.. కేంద్రం ఐటీ మార్గదర్శకాల ఫ్రేమ్‌వర్క్‌ను తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది. ట్విట్టర్, కేంద్రం సహా ఎథిస్ట్‌రిపబ్లిక్ ఖాతా నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది.
 
అంతిమంగా వివాదాన్ని పెంచడమే తప్పా వేరే మతానికి సంబంధించి ఇలాంటివి జరిగితే, మీరు చాలా జాగ్రత్తగా, మరింత సున్నితంగా ఉంటారని మేము ధైర్యంగా చెప్పగలమని మండిపడింది. కోర్టు ఉత్తర్వుల్లేకుండా బ్లాక్ చేయలేమంటున్నారు సరే, ట్రంప్ విషయంలో ఏ కోర్టు ఆదేశాలిచ్చిందో తెలియజేయాలని నిలదీసింది. 
 
అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాదారులను బ్లాక్ చేయడం పట్ల మీ విధానాన్ని తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు అడిగింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments