Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌పై కాల్పులు - హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో అలెర్ట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (09:11 IST)
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... ఢిల్లీకి తిరిగి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. ముందుస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
 
పాతబస్తీ, చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. అదుబాటులో ఉన్న క్విక్ యాక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ బలగాలను రంగంలోకిదించారు. అలాగే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments