పట్టాలెక్కిన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు.. స్మార్ట్ కార్డులపై డిస్కౌంట్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (13:34 IST)
గత 15 నెలలుగా సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వే వర్క్‌షాప్ కే పరిమితమైన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. గతంలో 121 సర్వీసులు తిరుగుతుండగా బుధవారం నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
 
ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్‌- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా రెండేసి చొప్పున మొత్తం 4 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయి. ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు రైళ్లు తిరుగుతాయి.
 
గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అప్పడు సీజన్ టికెట్లు తీసుకున్నవారు వాటిని పూర్తి కాలం వినియోగించుకోలేక పోయారు. అలాంటి వారు జూన్23వ తేదీ నుంచి మిగిలిన రోజులు ఎన్ని ఉంటే అన్ని రోజుల వరకు పాత టికెట్లను వినియోగించుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో గడువు పెంచుకోవచ్చని అన్నారు.
 
కరోనా నేపధ్యంలో స్టేషన్లలో నగదుతోపాటు స్మార్ట్ కార్డులున్నవారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని… ఇలా తీసుకుంటే టికెట్ పై 3 శాతం డిస్కౌంట్ లభిస్తుందని చెప్పారు. యూటీఎస్ యాప్ (అన్‌ రిజర్వుడు టిక్కెటింగ్‌ సిస్టం) ద్వారా పేపర్ లెస్ టికెట్ పొందేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments