Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నాన్న కూతురిపై 6 నెలల పాటు అత్యాచారం.. మైనర్ గర్భం దాల్చడంతో...?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:14 IST)
కామాంధులు వావి వరసులు మరిచిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా విచక్షణ మరిచి వరుసకు చెల్లెలు వరసయ్యే బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో చోటుచేసుకుంది. ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తుండగా బాలిక గర్భం దాల్చడంతో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. వావివరసలను మరిచి మైనర్ అయ్యే చెల్లెలిపై కామాంధుడు కన్నేశాడు. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు కన్నాయిగూడెం మండలం వాసంపల్లిలో చంటి(28) అనే యువకుడని తేలింది. ఇతని పెళ్లై.. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఈ కామాంధుడి కళ్లు తన సొంత చిన్నాన్న కూతురిని వేధించి, బెదిరించి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని, తన తల్లిదండ్రులనూ హతమారుస్తాన, ఇల్లు తగల పెడతానని భయపెట్టినట్లు బాలిక తెలిపింది.
 
మూడు రోజుల క్రితం ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా... గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. 
 
బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టిన పోలీసులు ఫోక్సో చట్టం, 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం