Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్‌ డేలో సరికొత్త రికార్డును సృష్టించిన హైదరాబాద్ మెట్రో

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:04 IST)
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నెల 3వ తేదీన మెట్రో రైలులో ఏకంగా 5 లక్షల 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి కూకట్ పల్లి మార్గంలో అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణించారని తెలిపింది. అలాగే, ఈ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 
 
కాగా, భాగ్యనగరిలో గత 2017 నవంబరు 29వ తేదీన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నగరంలోని రహదారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉండటంతో భాగ్యనగరి వాసులు అధికంగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆఫీస్ వేళల్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అమీర్‌పేట్ జంక్షన్ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఫలితంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సేవల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments