Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్‌ డేలో సరికొత్త రికార్డును సృష్టించిన హైదరాబాద్ మెట్రో

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:04 IST)
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నెల 3వ తేదీన మెట్రో రైలులో ఏకంగా 5 లక్షల 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి కూకట్ పల్లి మార్గంలో అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణించారని తెలిపింది. అలాగే, ఈ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 
 
కాగా, భాగ్యనగరిలో గత 2017 నవంబరు 29వ తేదీన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నగరంలోని రహదారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉండటంతో భాగ్యనగరి వాసులు అధికంగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆఫీస్ వేళల్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అమీర్‌పేట్ జంక్షన్ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఫలితంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సేవల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments