Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవం: అర్థరాత్రి 1 గంట వరకు..?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:37 IST)
హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు మెట్రో రైల్‌ అధికారులు శుభవార్త తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించారు. 
 
హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవ కోలాహలం ఇప్పటికే మొదలైంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. 
 
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. గురువారం అర్థరాత్రి 1 గంట వరకు రైళ్లను హైదరాబాద్‌ మెట్రో నడపనుంది. 
 
రాత్రి 2 గంటలకు ఆయా రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇందుకోసం ఖైరతాబాద్, లక్డీకపూల్‌ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. 
 
డిమాండ్‌ను బట్టి ఆయా మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. 29వ తేదీన పాత టైమింగ్స్‌ ప్రకారమే మెట్రో రైళ్లు నడుపుతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments