Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైన్ కట్టమన్న ట్రాఫిక్ పోలీసులు.. బైక్‌కు నిప్పంటించిన వ్యక్తి

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (09:31 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ ఫసీయుద్దీన్‌(35) వ్యాపారి. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మూడేళ్లలో 28 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడు. మంగళవారం ఆర్జీఐఏ ట్రాఫిక్‌ ఎస్సై శంకర్‌ ఆధ్వర్యంలో కిషన్‌గూడ పైవంతెన వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అతని వాహనాన్ని ఆపారు. దానికున్న పెండింగ్‌ చలాన్లను పరిశీలించగా రూ.9,110 జరిమానా ఉన్నట్లు తేలింది. 
 
ఈ చలాన్లు చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించిన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ఫసీయుద్దీన్‌ తన వాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ తెరిచి నిప్పంటించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఫసీయుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments