Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (16:27 IST)
హైదరాబాద్ ఇందిరాపార్కు (ఇందిరా పార్క్) నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టారు. ఇంకా ఆ స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గిపోనుంది. 
 
సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 48 ప్రాజెక్టులలో ఇదొకటి. సిటీ చరిత్రలోనే తొలిసారిగా భూ సేకరణ జరపకుండా, పూర్తిగా ఉక్కుతోనే నిర్మించిన బ్రిడ్జి ఇదే కావడం విశేషం. 
 
దక్షిణాదిలో అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా ఈ వంతెన రికార్డులకెక్కింది. 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments