Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విషాదం... ఏఎస్ఐ మృతి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (10:42 IST)
హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మహిపాల్ కన్నుమూశారు. 
 
ఈ నెల 27వ తేదీన శనివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఆయన్ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన తుది శ్వాస విడిచారు. 
 
నిజాంపేట్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో వస్తున్న సృజన్ అనే యువకుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసులను చూసి వేగంగా వెనక్కు మళ్లే సమయంలో వెనుక ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. 
 
మళ్లీ వెంటనే ముందుకు రానివ్వడంతో అక్కడున్న హోంగార్డుకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సృజన్‌కు ఆల్కహాల్ టెస్టు చేయగా 170 రీడింగ్ వచ్చింది. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి స్టేషన్‌కు సమాచారమిచ్చారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి పెట్రోలింగ్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను విషయం అడిగి తెలుసుకుంటుండగా.. అటుగా వస్తున్న మరో కారు ఏఎస్సై మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది మహిపాల్ రెడ్డిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డి రాత్రి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments