Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా ఉందనీ.. ఆ కిరాతక భర్త ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (09:17 IST)
సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు తలెత్తడం సహజమే. కొన్ని క్షణాల్లో అవన్నీ సర్దుకునిపోతాయి. కానీ, ఇక్కడ ఆ మనస్పర్థలే ఓ వివాహిత దారుణ హత్యకు కారణమయ్యాయి. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన యోగి, అరుణ యువతీయువకులు ఆర్నెల్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మియాపూర్‌లో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం భార్య నల్లగా ఉండటమే. ఈ ఒక్క కారణంతో మంగళవారం సాయంత్రం ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం యోగి కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 
 
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. అయితే.. ప్రేమించిన యువతితోకాకుండా మేనకోడలితో పెద్దలు పెళ్లి చేయడంతో భార్యను యోగి వేధించసాగాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments