హేమంత్ పరువు హత్య.. ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి..

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:24 IST)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే సుపారీ ముఠాకు చెందిన ఇద్దరితోపాటు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. హత్య కేసులో క్రైమ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సైతం పూర్తి చేశారు. కేసు దర్యాప్తు బృందంలో ఒకరైన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కొవిడ్‌ బారినపడటంతో దర్యాప్తు బాధ్యతలను రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.
 
ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి చేస్తామని, నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్‌ భార్య అవంతితోపాటు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులను కోరారు. 
 
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తనతోపాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని అవంతి సీపీని కోరింది. స్పందించిన ఆయన చందానగర్‌లో హేమంత్‌ ఇంటివద్ద భద్రత కల్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments