Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమంత్ పరువు హత్య.. ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి..

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:24 IST)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే సుపారీ ముఠాకు చెందిన ఇద్దరితోపాటు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. హత్య కేసులో క్రైమ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సైతం పూర్తి చేశారు. కేసు దర్యాప్తు బృందంలో ఒకరైన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కొవిడ్‌ బారినపడటంతో దర్యాప్తు బాధ్యతలను రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.
 
ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి చేస్తామని, నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్‌ భార్య అవంతితోపాటు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులను కోరారు. 
 
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తనతోపాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని అవంతి సీపీని కోరింది. స్పందించిన ఆయన చందానగర్‌లో హేమంత్‌ ఇంటివద్ద భద్రత కల్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments