Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో కుమ్మేసిన వర్షం - వీధులు జలమయం... కరెంట్ కట్

Webdunia
బుధవారం, 4 మే 2022 (07:41 IST)
హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున వర్షం కుమ్మేసింది. దీంతో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా నగరం ఒక్కసారిగా చల్లబడింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో భాగ్యనగరి వాసులు అల్లాడిపోతున్నారు. అయితే, ఈ భారీ వర్షంతో నగర వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది. 
 
నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్ నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం సహా దాదాపు నగరమంతా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. 
 
లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. పంజాగుట్ట సర్కిల్ వద్ద భారీగా నీరు చేరడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments