Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్డ్ ఉద్యోగికి రూ.21 లక్షలు టోకరా?

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:30 IST)
పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బులతో శేష జీవితంలో ఆసరాగా ఉంటాయని భావించాడు. బీమాతో లైఫ్‌కు ధీమా ఉంటుందని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి వద్ద నుంచి రూ.21లక్షలు దోచేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బాధితుడు రైల్వేలో టెక్నికల్‌ విభాగంలో పనిచేసి రిటైర్డు అయ్యాడు. మూడు నెలల కిందట బాధితుడికి ఫోన్‌ చేసి.. తాము ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ నుంచి మాట్లాడుతున్నాని చెప్పి రూ.53 వేల విలువైన పాలసీని చేయించారు. తర్వాత ఫోన్‌ చేసి ఆ పాలసీ కంటే ప్రీమియం ఎక్కువగా వచ్చేది మరొకటి ఉందని, మీకు త్వరగా పాలసీ డబ్బులు వస్తాయంటూ నమ్మించారు.
 
తాము చెప్పినట్లు పన్నులు చెల్లిస్తే చాలు.. సదరు పాలసీకి రావాల్సిన డబ్బులు భారీగా వెంటనే ఇప్పిస్తామంటూ బోల్తా కొట్టించారు. ఇలా వారి మాటలు విన్న బాధితుడు తనకు త్వరగా ఇన్సూరెన్స్‌ నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డాడు. 
 
ఆ విశ్రాంత ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులను మూడు నెలల కాలంలో 8 బ్యాంకు ఖాతాల్లో రూ.21 లక్షలు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు డిపాజిట్‌ చేశాడు. తీరా ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గ్రహించి బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments