Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్డ్ ఉద్యోగికి రూ.21 లక్షలు టోకరా?

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:30 IST)
పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బులతో శేష జీవితంలో ఆసరాగా ఉంటాయని భావించాడు. బీమాతో లైఫ్‌కు ధీమా ఉంటుందని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి వద్ద నుంచి రూ.21లక్షలు దోచేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బాధితుడు రైల్వేలో టెక్నికల్‌ విభాగంలో పనిచేసి రిటైర్డు అయ్యాడు. మూడు నెలల కిందట బాధితుడికి ఫోన్‌ చేసి.. తాము ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ నుంచి మాట్లాడుతున్నాని చెప్పి రూ.53 వేల విలువైన పాలసీని చేయించారు. తర్వాత ఫోన్‌ చేసి ఆ పాలసీ కంటే ప్రీమియం ఎక్కువగా వచ్చేది మరొకటి ఉందని, మీకు త్వరగా పాలసీ డబ్బులు వస్తాయంటూ నమ్మించారు.
 
తాము చెప్పినట్లు పన్నులు చెల్లిస్తే చాలు.. సదరు పాలసీకి రావాల్సిన డబ్బులు భారీగా వెంటనే ఇప్పిస్తామంటూ బోల్తా కొట్టించారు. ఇలా వారి మాటలు విన్న బాధితుడు తనకు త్వరగా ఇన్సూరెన్స్‌ నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డాడు. 
 
ఆ విశ్రాంత ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులను మూడు నెలల కాలంలో 8 బ్యాంకు ఖాతాల్లో రూ.21 లక్షలు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు డిపాజిట్‌ చేశాడు. తీరా ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గ్రహించి బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments