పిల్లల కదలికలపై నిఘా వుంచండి, ప్రేమ వివాహం చేసుకుంటే...?: హైదరాబాద్ సిపీ

Webdunia
సోమవారం, 30 మే 2022 (21:01 IST)
ఇటీవల హైదరాబాదు నగరంలో సంచలనం సృష్టించిన పరువు హత్యల నేపధ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్ మాట్లాడారు. ప్రేమ వివాహం పెద్దలకు ఇష్టంలేనట్లయితే ఆ జంటను పట్టించుకోకుండా వదిలేయాలనీ, అలా కాకుండా కక్ష పెంచుకుని హత్యలు చేస్తామంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

 
పిల్లలు కాలేజీలకో, ఉద్యోగాలకో వెళ్లినపుడు వారిపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసవుతున్నారేమోనని ఓ కంట కనిపెడుతుండాలని సూచన చేసారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుంటూ ఇలాంటి ఘటనలకు ఆస్కారం వుండదన్నారు.

 
హైదరాబాద్ బేగం బజారులో ఇటీవల నీరజ్ అనే వ్యక్తిని హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో తమ పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ నేపధ్యంలో నీరజ్ భార్యను, ఆమె కుటుంబ సభ్యులను సీపీ ఆనంద్ పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments