Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లతో సీఎం సమావేశం

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (11:33 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల అజెండాతో పాటు అభివృద్ధి పనులు, పథకాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 
 
దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేశారు. పీవోబీ, తప్పులు సరిదిద్దడం తదితర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. వీటిపైనే కలెక్టర్లు గత 15 రోజుల నుంచి వీఆర్ఏలు, ఆర్ఐలు, తాహశీల్దారులు, ఆర్డీవోలు ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. 
 
ధరణి పోర్టల్ పీవోబీ, పాస్ బుక్ డేటా కరెక్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వారీగా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఇపుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments