Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిచేయని టీకా: వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజుల తర్వాత కరోనా!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (11:18 IST)
కరోనా వైరస్ సోకకుండా అభివృద్ధి చేసిన టీకా పెద్ద ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఈ టీకా తీసుకున్న పలువురు మృత్యువాతపడుతున్నారు. అలాగే, మరికొందరికి ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతోంది. తాజాగా కరోనా టీకా వేయించుకున్న 20 రోజుల తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు వైరస్ బారిన పడటం కలకలం రేపింది. 
 
నిమ్స్‌కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్‌కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్‌ను తీసుకున్నారు. కాగా, ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 
 
టీకా తీసుకున్న తర్వాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఆ ఇద్దరి వైద్యులు పేర్లు మాత్రం బహిర్గతం చేయడం లేదు. 
 
కాగా, మన దేశంలో వ్యాక్సినేషన్ గత నెల 16న ప్రారంభం కాగా, రెండో డోస్ ఇవ్వడం ఇప్పుడే మొదలైంది. అయితే, రెండు డోస్‌లనూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తర్వాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, చాలా మంది ఈ వైరస్ సోకదన్న భావనలో ఉన్నారు. ఫలితంగానే టీకా వేయించుకున్న తర్వాత కూడా ఈ వైరస్ సోకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments